తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెద్దపల్లిలో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయాన్ని బసంత్నగర్కు బదులుగా అంతర్గాం ప్రాంతానికి తరలించనున్నారు. బసంత్నగర్లోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అంతర్గాం మండలంలో 591 ఎకరాల భూమిని గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది.