Agiripalli Chandrababu Naidu Funny Conversation With Girl: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో మాట్లాడారు. ఒక ఇంటికి వెళ్ళి, చిన్నారిని పలకరించారు. పెద్దయ్యాక ఏమవుతావమ్మా? అని అడిగితే.. ఆ పాప వెంటనే సీఎం అవుతానని చెప్పడంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని చంద్రబాబు అన్నారు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని, రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.