అనంతపురం జిల్లా పెన్నహోబిలం ఆలయంలో హుండీలో నగల మూట చోరీ యత్నం కలకలం రేపింది. భక్తులు వేసిన నగల మూటను చోరీ చేసేందుకు ఆలయ సిబ్బంది యత్నించారు. లెక్కింపు సమయంలో నగల మూటను దాచిపెట్టారు. అయితే సీన్ రివర్సైంది. వారి ప్లా్న్ బెడిసి కొట్టింది. దీంతో నగలమూటను తిరిగి తీసుకువచ్చి.. హుండీలో వేశారు. మరోవైపు ఈ విషయం బయటకు పొక్కగా భక్తులు మండిపడుతున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.