అన్న కూతురి పెళ్లికి తిరుపతి నుండి వచ్చిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి సందడిలో ఉండగా, ఆమె గదిలో దాచిన 30 లక్షల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. అనుమానితుల వివరాలను పోలీసులకు తెలియజేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ నగలు ఏమయ్యాయి? దొంగ ఎవరు?