Kurnool Recently Married Woman Ran Away: కర్నూలు జిల్లాలో ఓ యువకుడికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెళ్లిళ్ల బ్యూరో ద్వారా సంబంధం కుదిరింది. పెళ్లి కోసం రూ.4 లక్షలు ఖర్చు చేశారు. పెళ్లయిన 20 రోజులకే భార్య ఊరెళ్లి తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు యువతితో పాటు ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.