పేకాట స్థావరంపై పోలీసుల దాడిలో.. అతడు పట్టుబడినా బాగుండేది.. పాపం చివరకు..

5 months ago 9
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో పోలీసులు ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న చాకలి రాజయ్య (55) అనే వ్యక్తి భయంతో పరుగెత్తుతూ కుప్పకూలిపోయి మరణించాడు. గుండెజబ్బుతో బాధపడుతున్న రాజయ్య, భయంతో శ్వాస ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article