పేకాట స్థావరంపై పోలీసుల దాడిలో.. అతడు పట్టుబడినా బాగుండేది.. పాపం చివరకు..

11 months ago 21
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో పోలీసులు ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న చాకలి రాజయ్య (55) అనే వ్యక్తి భయంతో పరుగెత్తుతూ కుప్పకూలిపోయి మరణించాడు. గుండెజబ్బుతో బాధపడుతున్న రాజయ్య, భయంతో శ్వాస ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article