తెలంగాణలోని పేద రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల గట్ల పంచాయితీలకు త్వరలో సర్వే చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ భూముల్లో సాగుచేసుకుంటున్న పేదలకు జూన్ 2న సీఎం చేతుల మీదుగా పట్టాలు ఇస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు.