Ramireddy Rs 5 Crore Donation For Hospital పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమమైంది. గోల్కొండ గ్రూప్ అధినేత నడికట్టు రామిరెడ్డి రూ.5 కోట్ల విరాళం ప్రకటించడంతో ఆసుపత్రి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. అలాగే రామిరెడ్డి గతంలోనే ఎకరంన్నర భూమిని ఆసుపత్రి కోసం ప్రభుత్వానికి అందించారు.