తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మూడు విడతల్లో అమలు చేయనుంది. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తారు. దీనికి రూ.22,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించడం ద్వారా నగదు బదిలీలో జాప్యాన్ని నివారిస్తామని చెప్పారు.