తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. లబ్ధిదారులకు నిధుల చెల్లింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు హౌసింగ్ సెక్రటరీ ప్రత్యేకంగా జారీ చేశారు. ఇందులో పంచాయతీ సెక్రటరీల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు వారి వారి విధులను స్పష్టంగా పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాల తనిఖీ, బ్యాంక్-ఆధార్ వివరాల ధ్రువీకరణ, నాలుగు దశల్లో నిధుల చెల్లింపును పర్యవేక్షించేందుకు విజిలెన్స్ ఆఫీసర్లను నియమించారు.