ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు తీపి కబురు. ఇండ్ల మంజూరైన పేదలకు తొలి విడతలోనే రూ. లక్ష ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ నిధులు సిద్ధం చేసింది. త్వరలోనే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మెుదటి విడతగా పునాది పూర్తి చేసిన వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.