వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలో షాకింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. వేకువజామునే నిద్రలేచి టాయిలెట్కు వెళ్తుండగా.. బాత్రూం పక్కన ఉన్న సందులో ఏకంగా 8 అడుగుల పొడవు ఉన్న భారీ మొసలి దర్శనం ఇచ్చింది. పొద్దుపొద్దున్నే ఇంటి ముందు భారీ మొసలి చూసి.. ఆ ఇంటి యజమాని గుండె ఒక్కసారిగా కడుపులోకి జారినంత పనైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగి అతి కష్టం మీద బంధించి కృష్ణానదిలో విడిచిపెట్టారు.