చిత్తూరు జిల్లాలో జరిగిన మోసం తాజాగా వెలుగుచూసింది. తక్కువ రేటుకే బంగారం ఇస్తామంటూ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తులను.. కొంతమంది బురిడీ కొట్టించిన వైనం బయటపడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. పొలం దున్నుతుంటే బంగారం దొరికిందని.. గుట్టుగా ఎవరికీ తెలియకుండా తక్కువ రేటుకే అమ్ముతున్నామంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు.. నకిలీ బంగారాన్ని అంటగట్టి.. రూ.7.50 లక్షలు కాజేశారు.