బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ.. అతడు హాజరు కాకపోవడంతో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్న వేళ.. ఆయన ఇవాళ సిట్ విచారణకు గైర్హాజరు కావడంతో.. ఆ అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు.. బండి భగీరథ్ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది. దీంతో ఈ కేసులో ఏ జరగనుంది అనేద ఉత్కంఠ నెలకొంది.