దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15, 16వ తేదీలలో శాంతిని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై శాంతి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీన శాంతి ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. పలు ఆస్తులను గుర్తించింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు.