నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలో ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంతో రీల్స్ చేశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్గా మారింది. ఈ ఘటనపై విమర్శలు రాగా.. తాజాగా జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ఎస్ఐ మనవడు వాహనం తీసుకెళ్లినట్లు చెప్పారు. ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు.