రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 69 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు, వరద నేపథ్యంలో అధికారులు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలానే గోదావరి నదికి కూడా భారీ వరద కొనసాగుతోంది. బాసర వద్ద గోదారి ఉగ్రరూపం దాల్చింది.