AP Govt Hereditary Lands Registration For Rs 100: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. అక్టోబర్ నుండి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనుంది. త్వరలో రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆగస్టు వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి రూ.4,468.79 కోట్ల ఆదాయం వచ్చింది, ఇది గత ఏడాది కంటే 30.95% ఎక్కువ.