దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి నగరబాట పట్టిన ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచి స్పెషల్ సర్వీసులంటూ అమాంతం ధరలు పెంచేసింది. దీంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. వారికి మద్దతుగా హరీష్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.