తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఖమ్మంలో కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభించడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ట్రామా సెంటర్లు, క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలు, డయాలసిస్ సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. మారుమూల ప్రాంతాలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. రాబోయే వైద్య నియామకాల నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు ఉంటుందని.. దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.