ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ జీతాలు సకాలంలో చెల్లిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీకి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆమె సూచించారు. ఉపాధి హామీ ఉద్యోగుల జీతాలు విడుదల చేసినందుకు, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు మంత్రి సీతక్కను పలువురు సన్మానించారు.