తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. దసరా, దీపావళికి మహిళలకు ఉచితంగా రెండు చీరల పంపిణీకి సిద్ధమైంది. దాదాపు 65 లక్షల మందికి 1.30 కోట్ల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ చీరల తయారీ బాధ్యతను సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు అప్పగించడంతో వారికి ఉపాధి లభించనుంది. స్వయం సహాయక సంఘాల్లో 15 ఏళ్లు నిండిన మహిళలందరూ అర్హులేనని, 60 ఏళ్లు పైబడిన వారు కూడా కొనసాగవచ్చని మంత్రి సీతక్క తెలిపారు.