యూట్యూబర్ అన్వేష్పై సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆయన తన వీడియోలో తెలంగాణ డీజీపీ, మెట్రో ఎండీతో సహా పలువురు ఐఏఎస్ అధికారులపై బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో రూ. 300 కోట్లు కొట్టేశారని తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రజల్లో గందరగోళం సృష్టించేలా.. అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అన్వేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.