తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆరోగ్య కార్డుల సమస్యకు పరిష్కారం దొరికింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు భారీగా నిధులు విడుదల చేయనుంది. మరిన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగులు తమ ఆందోళనలు వాయిదా వేశారు.