ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై ఏపీ కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సిందూర్ పేరు ప్రజల సెంటిమెంట్ను తాకిందని.. రాష్ట్ర పథకాలకు ఇలాంటి పేర్లను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆపరేషన్ తర్వాత ఏపీ తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. పవన్ సూచన మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు ఆకర్షణీయమైన పేర్లను పరిశీలించనుంది.