గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే శుభవార్త చెప్పనున్నారు. వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వాటిని తీర్చేందుకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యంలో తెలంగాణను టాప్లో ఉంచడమే తమ లక్ష్యమని వెల్లడించారు.