ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు తీపి కబురు.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ, మంత్రి ప్రకటన

4 months ago 24
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కూరను అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేవలం వెన్నెముక ముల్లు మాత్రమే ఉండే 'తిలాపియా' చేపలను ప్రత్యేకంగా పెంచి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే సన్నబియ్యం, గుడ్లు అందిస్తుండగా.. తాజా నిర్ణయంతో విద్యార్థులకు మరింత బలవర్ధకమైన ఆహారం అందనుందని చెప్పారు.
Read Entire Article