ప్రభుత్వ ఆసుపత్రులలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన ఔషధి మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న జనరిక్ దుకాణాలను స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అంతేకాక జిల్లా ఆసుపత్రుల్లో కూడా జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని ద్వారా జనాలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించవచ్చు.