తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగానికి అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హైదరాబాద్ అభివృద్ధికి బిల్డర్లు సహకరించాలని కోరారు. పెట్టుబడులకు అనుకూలంగా ఫ్యూచర్ సిటీని తీసుకురానున్నామని, మూసీ నదిని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.