హైదరాబాద్కు తాగునీరు అందించే సింగూరు రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. డ్యామ్ పైభాగంలో రాతి కట్టడం దెబ్బతినడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ హెచ్చరించింది. మరమ్మతులు చేయకపోతే డ్యాం తెగిపోయే ప్రమాదం ఉందని, దిగువన ఉన్న బ్యారేజీలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పిట్టగోడకు చీలిక ఏర్పడిందని.. ఒకవైపు గోడ వంగిందని ప్యానెల్ వివరించింది. కట్ట పునాదిని వెంటనే గ్రౌటింగ్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ వివరాలు..