రెండు, మూడు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డిలో చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. రోడ్ల మీదకు వరద నీరు చేరడంతో.. ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రహదారులు కుంగిపోయి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈక్రమంలో ఓ రూట్లో రోడ్డు కుంగడంతో.. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 20 కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ వివరాలు..