trains cancelled : ఈ నెలలో రైలు ప్రయాణాలు బుక్ చేసుకున్నారా.. అయితే రైల్వే శాఖ మీకోసం కీలక అలర్ట్ ప్రకటించింది. ట్రాక్ మరమ్మతులు, లోకో షెడ్యూలింగ్, మహబూబాబాద్లో మూడో లైన్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. ఖమ్మం మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను మే 2 నుంచి 29 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్ల మార్గాలను మళ్లించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.