సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు ప్రత్యేక రైళ్లు ప్రారంభం అయ్యాయి. శ్రావణ మాసం సందర్భంగా ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్థులకు వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, ఆదివారం ఇలా వరుస సెలవుల నేపథ్యంలో రైళ్లలో రద్దీ నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు అదనపు రైళ్ల సర్వీసులను ప్రకటించారు. దీనిలో భాగంగా.. తెలంగాణ, ఏపీలోని హాల్ట్ స్టేషన్లను కూడా అధికారులు ప్రకటించారు. వాటి వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.