దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న తాజా నిర్ణయం ప్రయాణికులకు ఆనందకరంగా మారింది. సికింద్రాబాద్–నాగపూర్ వందే భారత్ రైలు ఇకపై సిర్పూర్ కాగజ్నగర్లోనూ ఆగనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, పుణే, నాగపూర్ రూట్లలో వందే భారత్ సేవలు నడుస్తున్నాయి. వేగం, సౌకర్యం కారణంగా ఈ రైళ్లు ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలకు మరింత ఉపయోగకరంగా మారాయి. సిర్పూర్ కాగజ్నగర్ స్టాప్ కల్పనతో ఉత్తర తెలంగాణ ప్రజలకు నాగపూర్, హైదరాబాద్ చేరుకోవడం సులభమవుతోంది.