దక్షిణ మధ్య రైల్వే వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి, శ్రీకాకుళం రోడ్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మే 12 నుంచి జూన్ 23వరకు ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి 07422 నంబర్ గల రైలు.. మే 13 నుంచి జూన్ 25 వరకు 07421 నంబర్ గల ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అలాగే, సంత్రాగచి - యశ్వంత్పూర్, షాలిమార్ - చెన్నై సెంట్రల్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైళ్లను కూడా పొడిగించింది.