పాలమూరు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. మహబూబ్నగర్, జడ్చర్ల, కృష్ణా రైల్వే స్టేషన్లలో మరిన్ని సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపడానికి అధికారులు అంగీకరించారు. ఎంపీ డీకే అరుణ చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది.