ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ దినం సందర్భంగా పాస్టర్ అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతూ పాస్టర్ అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో మాజీ ఎంపీ హర్షకుమార్ సైతం పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో సంచలన ఆరోపణలు చేశారు.