తెలంగాణలో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికిన ప్రజలను, ఉత్సవ కమిటీలను ఆయన అభినందించారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాగడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రతీ విభాగానికి చెందిన సిబ్బందికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాల నిమజ్జనాన్ని సాఫీగా, క్రమబద్ధంగా నిర్వహించిన ప్రజలకు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు.