హైదరాబాద్ నగరాన్ని మధ్య భారతదేశంతో కలిపే హైదరాబాద్-ఇండోర్ ఆర్థిక కారిడార్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల ప్రస్తుతం పట్టే 18 గంటల ప్రయాణ సమయం కేవలం 11 గంటలకు తగ్గుతుంది. తెలంగాణలో 100 కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారి.. సంగారెడ్డి నుండి బోధన్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. పారిశ్రామిక నగరమైన ఇండోర్ను ఐటీ హబ్ హైదరాబాద్తో నేరుగా అనుసంధానించడం ద్వారా వాణిజ్య రంగానికి పెద్ద పీట వేయనున్నారు. నర్మదా నదిపై వంతెనలు, సొరంగాల నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. త్వరలోనే ఈ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది.