Rompicherla Police Station Love Couple Marriage: చిత్తూరు జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటకు పోలీసులు దగ్గరుండి పెళ్లి జరిపించారు. వీరిద్దరు ఇటీవలే తిరుపతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. మరోవైపు, కుప్పంలో భర్త విదేశాలకు వెళ్లిన కొద్ది రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పాకాల మండలంలో ఓ వ్యక్తి భార్యను, ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.