తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ, ఆర్టీఈ కింద 25 శాతం సీట్ల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశం కానుంది. ఛైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని కమిటీకి గతంలోనే నివేదిక అందగా.. నివేదికను పరిశీలించనుంది. ఫీజుల నియంత్రణ చట్టంపై కమిటీలో చర్చించనున్నారు. ఆర్టీఈ అమలుపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో.. దీనిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.