హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో జరిగిందని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏకు రూ. 75.88 కోట్ల నష్టం వాటిల్లగా.. ఎఫ్ఈవో సంస్థ రూ. 46 కోట్లు లబ్ధి పొందింది. ఈ నేపథ్యంలో అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతి కోరుతూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది.