ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుతో ఎంతో సమయం వృథా అయ్యేది. ఈ సమస్యకు పరిష్కారంగా 2019 డిసెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే.. తాజాగా టోల్ వసూలును మరింత సులభతరం చేస్తూ.. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో ఫాస్టాగ్ లేకున్నా.. వాహనం ఆగకుండానే టోల్ వసూలవుతుంది.