Increase Cheyutha Pension Amount: తెలంగాణలోని పెన్షన్ దారులకు రేవంత్ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్లను రూ.6 వేలకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి హామీలను నెరవేర్చిన ప్రభుత్వం, త్వరలోనే పెన్షన్ పెంపుపై అధికారిక ప్రకటన చేయనుంది.