బీఆర్ఎస్ పార్టీలో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ కేటీఆర్, పాడికౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ను విచారించిన.. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు 10 నెలల సమయం రీజనబుల్ టైం కాదా అంటూ ప్రశ్నలు సంధించింది. మరి రీజనవబుల్ టైం అంటే ఎంతో చెప్పాలని అడిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.