జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా.. పంజాగుట్ట ప్రాంతంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాదయాత్ర చేపట్టిన మేయర్.. నాగార్జున సర్కిల్ దగ్గర పుట్పాత్పై కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయారు. ఈ ఘటనలో మేయర్కు చిన్న చిన్న గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్, విజయా రెడ్డి ఆమెను పైకి లేపి సంబాలించారు.