తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలో బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆయన ఆరోపించారు. సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని అధికారులు కోరినా ఆయన స్పందించలేదు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఉండటంతో సిట్ విచారణకు వెళ్లడం లేదని తెలుస్తోంది.