Phone Tapping Case KCR: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో సిట్కు కేసీఆర్ లేఖ రాశారు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. అలా నోటీసులు అంటించడం చెల్లదన్నారు. తన గౌరవానికి భంగం కలిగించారని కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా తనకు నోటీసులు ఇచ్చే పరిధి ఏసీపీకి లేదన్నారు. అయినా తాను ఆదివారం విచారణకు హాజరు కానున్నట్లు కేసీఆర్ తెలిపారు.