తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణకు హాజరుకానున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావును నేడు జూబ్లీహిల్స్లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది.