తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నిఘా కోసమే ఎస్వోటీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన విచారణలో అంగీకరించారు. అప్పటి డీఎస్పీ ప్రణీత్ రావును ఈ అక్రమ కార్యకలాపాల కోసమే నియమించామన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రముఖుల ఫోన్లను 'మావోయిస్టు' ముసుగులో ట్యాప్ చేసినట్లు ఆయన విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది.